స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ
ABN, First Publish Date - 2020-11-10T00:04:26+05:30
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నిర్ణీత సమయం ముగిసినా ఎన్నికలు జరగడం లేదని పిటిషన్ పేర్కొన్నారు.
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నిర్ణీత సమయం ముగిసినా ఎన్నికలు జరగడం లేదని పిటిషన్ పేర్కొన్నారు. దశలవారీగా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే హైకోర్టులో అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేశామని ఈసీ పేర్కొంది. అఫిడవిట్ రికార్డుల్లో లేకపోవడంతో సబ్మిట్ చేయాలని హైకోర్టు సూచించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని ఏజీ తెలిపారు. ఈనెల 16న సుప్రీంకోర్టు ముందుకు వస్తుందని ఏజీ చెప్పారు. అప్పటివరకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోరారు. పిటిషన్ చీఫ్ జస్టిస్ బెంచ్కు పంపాలని న్యాయస్థానం ఆదేశించింది.
Updated Date - 2020-11-10T00:04:26+05:30 IST