ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైకోర్టులో విచారణ
ABN, First Publish Date - 2020-05-29T20:33:00+05:30
అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై వాస్తవాలను తమ దృష్టికి తీసుకురావాలని..
అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై వాస్తవాలను తమ దృష్టికి తీసుకురావాలని గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులు దేశం వదిలి వెళ్లకూడదని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు విచారణను ధర్మాసనం వచ్చే వారానికి వాయిదా వేసింది.
Updated Date - 2020-05-29T20:33:00+05:30 IST