గురజాడకు ట్విట్టర్ వేదికగా లోకేశ్ నివాళులు
ABN, First Publish Date - 2020-09-21T20:36:48+05:30
ప్రఖ్యాత తెలుగు సాహితీవేత్త గురుజాడ అప్పారావు జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు.
అమరావతి: ప్రఖ్యాత తెలుగు సాహితీవేత్త గురుజాడ అప్పారావు జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. సాహిత్యం అనేది కాలక్షేపానికి కాదని, సమాజాన్ని సంస్కరించి ముందడుగు వేయించే ఒక ఆయుధమని చాటిన మహనీయుడు గురజాడ అప్పారావు అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా స్త్రీలకు మద్దతుగా నిలిచి వారి సమస్యలను వెలుగులోకి తేవడంలో ఆయన కృషి అనితర సాధ్యమన్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అని ట్వీట్ చేశారు.
Updated Date - 2020-09-21T20:36:48+05:30 IST