కరోనా కేసులపై గోప్యత ఎందుకు?
ABN, First Publish Date - 2020-04-08T10:35:10+05:30
కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విషయాలను ఎందుకు గోప్యంగా ఉంచుతుందని మాజీ మంత్రి నక్కా
కరోనా నియంత్రణకు ప్రభుత్వం మేధావుల సూచనలు తీసుకోవాలి
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
గుంటూరు, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విషయాలను ఎందుకు గోప్యంగా ఉంచుతుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. ఎంతమందికి పాజిటివ్గా తేలింది.. ఎందరు క్వారంటైన్లో ఉన్నారు.. అసలు విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య ఎంత అనే విషయాలను బయటపెట్టాలన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంపై కరోనా పంజా విసురుతున్న వేళ రాజకీయాలు చేయటం తగదన్నారు.
చంద్రబాబు సూచనలు తీసుకోవటం ఇష్టం లేకపోతే ఇతర మేధావులను సంప్రదించి చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర చేస్తున్న సాయాన్ని తాము చేస్తున్నట్లు చెప్పుకొంటూ భౌతికదూరం పాటించాల్సిన సమయంలో వైసీపీ నేతలు గుంపులు, గుంపులుగా తిరగటం ఏమిటని నిలదీశారు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైయిందని సమావేశంలో పాల్గొన్న నేతలు మన్నవ సుబ్బారావు, మహ్మద్ నసీర్, కోవెలమూడి రవీంద్ర, డేగల ప్రభాకరరావులు విమర్శించారు. సమావేశంలో నేతలు చిట్టాబత్తిని చిట్టిబాబు, కంచర్ల శివరామయ్య, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విలేకరులకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు నేతృత్వంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు.
Updated Date - 2020-04-08T10:35:10+05:30 IST