విజయకీలాద్రిపై నిత్య పూర్ణాహుతి
ABN, First Publish Date - 2020-11-25T04:51:27+05:30
తాడేపల్లి పట్టణంలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి వారి మంగళశాసనాలతో రామయాణ క్రతువు మంగళవారం జరిగింది.
తాడేపల్లి టౌన్, నవంబరు 24: తాడేపల్లి పట్టణంలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి వారి మంగళశాసనాలతో రామయాణ క్రతువు మంగళవారం జరిగింది. ఇందులో భాగంగా రామాయణ సుందరకాండ పారాయణం, నిత్య పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. శ్రీత్రిదండి అహోబిల రామానుజ జీయర్స్వామి, జీయర్ ఆశ్రమ నిర్వాహకులు వెంకటాచార్యులు, వేదపండితులు, ఆశ్రమ విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-25T04:51:27+05:30 IST