ఇంటిలిజెంట్ సిస్టమ్తో ఉజ్వల భవిష్యత్తు
ABN, First Publish Date - 2020-12-12T05:11:48+05:30
ఇంటిలిజెంట్ సిస్టమ్లో పట్టు సాఽధిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు ప్రొఫెసర్ డాక్టర్ వి.రాఘవేంద్రరావు అన్నారు.
గుంటూరు(విద్య), డిసెంబరు 11: ఇంటిలిజెంట్ సిస్టమ్లో పట్టు సాఽధిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు ప్రొఫెసర్ డాక్టర్ వి.రాఘవేంద్రరావు అన్నారు. వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్మర్మేషన్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మానవ రహిత కార్లు తయారీలో ఇంటిలిజెంట్ సిస్టమ్ పాత్ర ఎంతో ఉందన్నారు. వీసీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఇంటిలిజెంట్ సిస్టమ్ టెక్నాలజీలో కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో ఐటీ విభాగాఽధిపతి డాక్టర్ కేవీ కృష్ణకిషోర్, ఆచార్య ఎన్.వీరాంజనేయులు, డాక్టర్ కె.సుజాత తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T05:11:48+05:30 IST