జిల్లాలో మరో రెండు కరోనా కేసులు
ABN, First Publish Date - 2020-06-01T09:38:07+05:30
జిల్లాలో కరోనా కేసులు ఆదివారం మరో రెండు నమోదయ్యాయి. వీటితో కరోనా కేసుల సంఖ్య 476కు చేరింది.
నరసరావుపేట, మే 31 : జిల్లాలో కరోనా కేసులు ఆదివారం మరో రెండు నమోదయ్యాయి. వీటితో కరోనా కేసుల సంఖ్య 476కు చేరింది. కొత్తగా నమోదైన కేసులు రెండు నరసరావుపేట పట్టణానికి చెందినవే. ప్రకాష్ నగర్లో ఇరువురు వ్యక్తులకు కరోనా సోకింది. శ్రీనివాసనగర్కు చెందిన వ్యక్తి ద్వారా వీరిరువురికి వైరస్ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. నరసరావుపేటలో కరోనా కేసుల సంఖ్య 197కు చేరింది. కాగా 174 మంది కోవిడ్ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈపూరు మండలం వనికుంట గ్రామాన్ని ఆదివారం నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి సందర్శించారు. చిలకలూరిపేట పట్టణంలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో నరసరావుపేట ఆర్డీవో వెంకటేశ్వరరావు పర్యటించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Updated Date - 2020-06-01T09:38:07+05:30 IST