ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తారాజువ్వ రగడ ఒకరి ప్రాణం తీసింది!

ABN, First Publish Date - 2020-11-26T04:17:25+05:30

దీపావళి రోజున పేల్చిన తారాజువ్వ పక్కవీధిలోని వృద్ధురాలిపై పడి చీర కాలిపోవడంతో అదికాస్త మంగళవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీయడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు.

మృతి చెందిన నాగభూషణం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజుపాలెం, నవంబరు 25: దీపావళి రోజున పేల్చిన తారాజువ్వ పక్కవీధిలోని వృద్ధురాలిపై పడి చీర కాలిపోవడంతో అదికాస్త మంగళవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీయడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని గణపవరానికి చెందిన మాటా నాగభూషణం (40) రంగు కోడిపిల్లలు అమ్ముకొని జీవనం సాగించేవాడు. దీపావళి పండుగ రోజున అతని కుమారుడు వేంకటేశ్వర్లు బాణసంచా కాల్చాడు. ఈ సందర్భంగా తారాజువ్వ రవ్వలు పక్కవీధిలోని ఓ వృద్ధురాలిపై పడి చీరకాలడంతో రెండువర్గాల మధ్య అప్పటి నుంచి గొడవ జరుగుతూనే వుంది. మంగళవారం వృద్ధురాలి కోడలు వచ్చి వేంకటేశ్వర్లుపై గొడవకు దిగింది. ఈక్రమంలో ఇరువర్గాలమధ్య గొడవ తీవ్రమవడంతో  నాగభూషణంపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో నాగభూషణంలో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు వేంకటేశ్వర్లు ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-11-26T04:17:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising