ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వం, టీడీపీకి సుప్రీంకోర్టు నోటీసులు

ABN, First Publish Date - 2020-10-27T18:05:41+05:30

గుంటూరులో టీడీపీ కార్యాలయ భూ వివాదంలో ఏపీ ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ/అమరావతి : గుంటూరులో టీడీపీ కార్యాలయ భూ వివాదంలో ఏపీ ప్రభుత్వం, టీడీపీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుతో పాటు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల పిటిషన్‌ను కూడా కలిపి విచారించాలని కోర్టు నిర్ణయించింది. అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. పిటిషనర్ తరఫున ప్రశాంత్ భూషణ్, రమేష్ వాదనలు వినిపించారు.


పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి భూ కేటాయింపులు జరిపారని.. టీడీపీ ఆఫీస్ కోసం జరిపిన భూ కేటాయింపులు రద్దు చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. గతంలో ఆర్కే పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు ఉత్వర్వులను ఆర్కే సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారించి నోటీసులు జారీ చేయడం జరిగింది. కాగా.. ఆత్మకూరు పరిధిలోని సర్వే నంబర్ 392లో ఉన్న 3.65 ఎకరాల వాగు పోరంబోకు భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి 99 సంవత్సరాల పాటు లీజుకిస్తూ గత ప్రభుత్వం 2017లో జీవో జారీ చేసిందని ఎమ్మెల్యే ఆర్కే అప్పట్లో ఆరోపించడం సంచలనమైంది.

Updated Date - 2020-10-27T18:05:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising