ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మా.. నేనూ నీతోనే..తల్లి మరణవార్త విని ఆగిన కొడుకు గుండె

ABN, First Publish Date - 2020-12-05T18:56:38+05:30

తల్లి మరణవార్త విని కుమారుడు హఠాన్మరణం చెందిన ఘటన మండలంలోని అప్పాపురంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మృతుడు ప్రభుత్వ పాఠశాల పీఈటీ


కాకుమాను (గుంటూరు): తల్లి మరణవార్త విని కుమారుడు హఠాన్మరణం చెందిన ఘటన మండలంలోని అప్పాపురంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దారా విజయమ్మ(78)  అనారోగ్యంగా ఉండడంతో  ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.  ఆమె కుమారుడు, కర్లపాలెం మండలం గణపవరం జెడ్పీ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దారా సజ్జనరావు(58) విధులు ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చాడు. ఆసుపత్రికి తీసుకువెళ్లిన విజయమ్మ మృతి చెందినట్లు  అక్కడి నుంచి ఫోన్‌లో ఆయనకు సమాచారం అందింది. దీంతో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. సజ్జనరావుకు భార్య జయలక్ష్మీకుమారి, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకేరోజు కుటుంబంలో ఇద్దరు మరణించడంతో కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న హోంమంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

Updated Date - 2020-12-05T18:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising