స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు ముక్కలాట
ABN, First Publish Date - 2020-12-04T06:10:04+05:30
స్వార్థ ప్రయోజనాల కోసమే సీఎం జగన్ మూడు రాజధానులంటూ డ్రామాలాడుతున్నారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి విమర్శించారు.
రాజధానిపై రేపు సీఎంను కలుస్తాం
ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి
గుంటూరు, డిసెంబరు 3: స్వార్థ ప్రయోజనాల కోసమే సీఎం జగన్ మూడు రాజధానులంటూ డ్రామాలాడుతున్నారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి విమర్శించారు. గుంటూరు రాజీవ్గాంధీభవన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి ఉండాలంటూ శనివారం ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏపీసీసీ కార్యాలయం నుంచి సీఎం అపాయింట్మెంట్ కోరినట్లు తెలిపారు. అయితే సీఎంవో నుంచి ఎటువంటి స్పందన రాలేదని, అయినా మంగళగిరి నుంచి తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో సీఎంను కలిసేందుకు వెళ్ళనున్నట్లు తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత లింగంశెట్టి ఈశ్వరరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి జగన్మోహన్రెడ్డి, నూనె పవన్తేజ తదితరులున్నారు.
Updated Date - 2020-12-04T06:10:04+05:30 IST