నా వ్యాఖ్యలు వక్రీకరించారు : ఎమ్మెల్యే బొల్లా
ABN, First Publish Date - 2020-06-04T08:49:24+05:30
ఇసుక విషయంలో తను చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు, కొన్ని టీవీ చానల్స్, పత్రికలు వక్రీకరించాయని ..
వినుకొండ/వినుకొండ టౌన్, జూన్ 3: ఇసుక విషయంలో తను చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు, కొన్ని టీవీ చానల్స్, పత్రికలు వక్రీకరించాయని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆయన బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోమవారం గుంటూరులో జరిగిన సమావేశంలో ఇసుక అందుబాటులోకి రావడం లేదని, ఈ విషయంపై ప్రజాప్రతినిధిగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే తప్ప ప్రభుత్వంపై వ్యతిరేకతతో మాట్లాడలేదన్నారు. రాష్ట్రంలో అవినీతిరహిత పాలన సాగుతుందని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తాను ఎప్పుడూ ముందుంటానన్నారు. సమావేశంలో మార్కెట్యార్డు చైర్మన్ గంధం బాలిరెడ్డి, వైసీపీ నాయకులు చిన్నబ్బాయి ఉన్నారు.
Updated Date - 2020-06-04T08:49:24+05:30 IST