సివిల్స్లో సత్తా.. మంగళగిరి యువతికి 757వ ర్యాంకు
ABN, First Publish Date - 2020-08-06T17:00:49+05:30
యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్ సర్వీసెస్- 2019 ఫలితాల్లో మంగళగిరికి..
మంగళగిరి(గుంటూరు): యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్ సర్వీసెస్- 2019 ఫలితాల్లో మంగళగిరికి చెందిన కండెల ప్రతిమ 757వ ర్యాంకు సాధించారు. రెండో ప్రయత్నంలోనే ఆమె సివిల్ సర్వీసెస్కు ఎంపిక కావ డం విశేషం. తండ్రి ఇస్రాయేలు గుంటూరు మిర్చి యార్డులో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. తల్లి జ్యోతి గృహిణి. ప్రతిమ పట్టణంలోని శ్రీ సరస్వతీ విద్యాల యంలో, ఇంటర్ తెనాలిలో, బీటెక్(ఐటీ) హైదరాబాద్ జేఎన్ టీయూ విశ్వవిద్యాలయంలో చదివారు. మంగళగిరికి చెందిన నాహీద్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. దంపతులిద్దరూ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. ప్రతిమను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అభినందించారు.
Updated Date - 2020-08-06T17:00:49+05:30 IST