ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్యా రాజకీయాలు సహించేది లేదు: నారా లోకేష్‌

ABN, First Publish Date - 2020-12-30T05:35:29+05:30

వైసీపీ నాయకులు హత్యా రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు.

శావల్యాపురంలో ప్రజలకు అభివాదం చేస్తున్న నారా లోకేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శావల్యాపురం, డిసెంబరు 29: వైసీపీ నాయకులు హత్యా రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. శావల్యాపురంలో మంగళవారం టీడీపీ కార్యకర్తలు చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనలో ప్రకాశం జిల్లా పర్యటన ముగించుకొని వెలగపూడి వెళుతున్న నారా లోకేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయన్నారు. అఽధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ  కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ సహించేది లేదని, రానున్న రోజుల్లో వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గుంటూరు సాంబశివరావు, గడిపూడి విశ్వనాథం, గోరంట్ల హనుమంతరావు, గద్దె మస్తాన్‌రావు, దొడ్డా ఏడుకొండలు, నలమాటి వెంకటేష్‌, చెరుకూరి కోటినారాయణ, చౌదరి, పాలడుగు ఏడుకొండలు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T05:35:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising