నేడు జిల్లాలో లోకేష్ పర్యటన
ABN, First Publish Date - 2020-12-05T05:38:33+05:30
జిల్లాలోని నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం పర్యటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
గుంటూరు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం పర్యటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా పొన్నూరు, బాపట్ల, చిలకలూరిపేట తదితర ప్రాంతాలో దెబ్బతిన్న పంటలను చూసి రైతులకు భరోసా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటలకు పొన్నూరు నియోజకవర్గంలోని పచ్చల తాడిపర్రు గ్రామం నుంచి యాత్ర మొదలవుతుందన్నారు. 10.30కు బాపట్ల నియోజకవర్గం ఈతేరు, 12.45కు పర్చూరు నియోజకవర్గం, మధ్యాహ్నం 3.45 సమయంలో చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామానికి లోకేష్ చేరుకొని రైతులతో మాట్లాడనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
Updated Date - 2020-12-05T05:38:33+05:30 IST