ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లికి నిరాకరించిందనే కోపంతో.. వివాహితను..

ABN, First Publish Date - 2020-08-02T13:41:38+05:30

పెళ్లికి నిరాకరించిందనే కోపంతో వివాహితను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహిత హత్య

పెళ్లికి నిరాకరించిందనే కారణంతో దారుణానికి ఒడిగట్టిన యువకుడు


ఈపూరు(గుంటూరు): పెళ్లికి నిరాకరించిందనే కోపంతో వివాహితను కత్తితో గొంతుకోసి హత్య చేసిన ఘటన మండలంలోని కూచినపల్లిలో శనివారం జరిగింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరులో నివాసం ఉండే ఆలా సుబ్బారావు, శ్యామల కుమార్డె తేజశ్రీ(21)కి గుంటూరుకే చెందిన సింగంశెట్టి ప్రవీణ్‌కు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. ఏడాదికే భార్యాభర్తలు విడిపోయారు. తేజశ్రీ తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. 


తేజశ్రీకి సమీప బంధువైన దుర్గాప్రసాదు ఆమెను వివాహం చేసుకుంటానని సుబ్బారావును అడిగాడు. కానీ తేజశ్రీకి ఇష్టం లేదు. ఆమె కూచినపల్లిలోని తాతయ్య పెదవెంకటేశ్వర్లు ఇంటికి నాలుగు రోజుల క్రితం వచ్చింది. శనివారం మధ్యాహ్నం సమయంలో ఇంటి వద్దకు వచ్చిన దుర్గాప్రసాదు కత్తితో విచక్షణారహితంగా తేజశ్రీ గొంతు కోశాడు. తాత బయటకు వచ్చి చూడగా తేజశ్రీ మృతి చెంది ఉంది. ఘటనా స్థలాన్ని వినుకొండ రూరల్‌ సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ సింగయ్య సందర్శించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దుర్గాప్రసాదు పోలీసులకు లొంగిపోయాడు. 


Updated Date - 2020-08-02T13:41:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising