వైసీపీ కక్ష రాజకీయాలకు కోడెల బలి
ABN, First Publish Date - 2020-09-17T11:31:28+05:30
వైసీపీ కక్షరాజకీయాలకు మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు బలయ్యారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి నక్కా ఆనంద
టీడీపీ నేతలు జీవీ ఆంజనేయులు, ఆనందబాబు
గుంటూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ కక్షరాజకీయాలకు మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు బలయ్యారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. డాక్టర్ కోడెల ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ జిల్లా కార్యాయలంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. తొలుత కోడెల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జీవీ మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో జన్మించి అంచలంచెలుగా ఉన్నతస్థానాలకు ఎదిగిన మహనీయుడు డాక్టర్ కోడెల అని కొనియాడారు. ఆనందబాబు మాట్లాడుతూ టీడీపీ అవిర్భావం నుంచి పార్టీ అభ్యున్నతికి డాక్టర్ కోడెల అహర్నిశలు శ్రమించారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, నేతలు మహ్మద్ నసీర్, ఎండీ హిదాయత్, ఎం.ధారునాయక్, మద్దిరాల జోసఫ్ఇమ్యానుయేల్, డేగల ప్రభాకర్, మానుకొండ శివప్రసాద్, పిల్లి మాణిక్యరావు, కంచర్ల శివరామయ్య, చిట్టాబత్తిని చిట్టిబాబు, కసుకుర్తి హనుమంతరావు, కనపర్తి శ్రీనివాసరావు, రావిపాటి సాయికృష్ణ, వేములపల్లి శ్రీరాంప్రపాద్, వేగుంట రాణి, బొబ్బిలి రామారావు తదితరులు డాక్టర్ కోడెలకు నివాళులర్పించారు.
Updated Date - 2020-09-17T11:31:28+05:30 IST