కిడ్నీ రోగులకూ... పింఛను ఇవ్వరూ
ABN, First Publish Date - 2020-11-14T03:55:47+05:30
ప్రైవేటు వైద్యశాలల్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న, తెలుపురంగు రేషన్ కార్డు కలిగి రోగులకు ప్రభుత్వం ప్రతి నెల ఫించన్ మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మన్నేపల్లి శ్యామ్ కోరారు.
గుంటూరు(మెడికల్), నవంబరు 13: ప్రైవేటు వైద్యశాలల్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న, తెలుపురంగు రేషన్ కార్డు కలిగి రోగులకు ప్రభుత్వం ప్రతి నెల ఫించన్ మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మన్నేపల్లి శ్యామ్ కోరారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డిని అసోసియేషన్ సభ్యులు కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి వీరి సమస్యను వివరించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అప్పిరెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి మర్రి సుబ్బరామిరెడ్డి, జాయింట్ సెక్రటరీ పులి కిరణ్, పీవీ భీమేశ్వరరావు, నాగ గోపి, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-14T03:55:47+05:30 IST