ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్రమత్తతే కరోనాకు మందు

ABN, First Publish Date - 2020-12-17T06:01:52+05:30

మాస్కుధరించటం, భౌతికదూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండటమే కరోనాకు సరైన మందు అని వాణిజ్య పన్నులశాఖ గుంటూరు-1 జాయింట్‌ కమిషనర్‌ ఓంకార్‌రెడ్డి పేర్కొన్నారు.

అవగాహన ర్యాలీలో జేసీలు ఓంకార్‌రెడ్డి, కిరణ్‌చౌదరి ఇతర ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీటీ శాఖ జేసీ ఓంకార్‌రెడ్డి 

గుంటూరు, డిసెంబరు 16: మాస్కుధరించటం, భౌతికదూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండటమే కరోనాకు సరైన మందు అని వాణిజ్య పన్నులశాఖ గుంటూరు-1 జాయింట్‌ కమిషనర్‌ ఓంకార్‌రెడ్డి పేర్కొన్నారు. వాణిజ్య పన్నులశాఖ ఆధ్వర్యంలో కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించటంలో భాగంగా నగరంలో బుధవారం ప్రదర్శన నిర్వహించారు. జిన్నాటవర్‌ సెంటర్‌ సీటీ శాఖ భవనం నుంచి మొదలైన ప్రదర్శన రాధాకృష్ణ ధియేటర్‌ సెంటర్‌ నుంచి మార్కెట్‌ సెంటర్‌ మీదుగా నాజ్‌ సెంటర్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజలు కరోనా పట్ల అస్సలు నిర్లక్ష్యం చేయవద్దన్నారు. నరసరావుపేట డివిజన్‌ జేసీ కిరణ్‌చౌదరి మాట్లాడుతూ ప్రజలు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవటంతో పాటు మాస్కులు ధరిస్తూ నిబంధనలు పాటిస్తే కరోనాను దూరంచేయటం పెద్ద సమస్య కాదన్నారు. కార్యక్రమంలో డీసీలు, ఏసీలు, అసోసియేషన్‌ నాయకులు జె.గోపినాధ్‌, కిషోర్‌కుమార్‌, శ్రీనివాసరావు, ప్రసాద్‌, సయ్యద్‌ జానీబాషా, ఉద్యోగులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-17T06:01:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising