గుంటూరులో టీడీపీ నిరసన
ABN, First Publish Date - 2020-12-05T15:50:36+05:30
జిల్లాలోని లాంచెస్టర్ రోడ్డులో గల వార్డు సచివాలయం వద్ద టీడీపీ నిరసనకు దిగింది.
గుంటూరు: జిల్లాలోని లాంచెస్టర్ రోడ్డులో గల వార్డు సచివాలయం వద్ద టీడీపీ నిరసనకు దిగింది. టిడ్కో లబ్దిదారుల ఎంపికలో అవకతవకలపై టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. టీడీపీ ఇన్చార్జ్ నసిర్ ఆధ్వర్యంలో వార్డు సచివాలయం ఎదుట ధర్నాకు దిగారు. జగన్ రెడ్డి ఇళ్ళు వద్దు... ప్రభుత్వ ఇళ్ళు కావాలంటూ టీడీపీ నేతలు నినాదాలు చేస్తున్నారు.
Updated Date - 2020-12-05T15:50:36+05:30 IST