గుంటూరులో ఆలపాటి రాజా మహా పాదయాత్ర
ABN, First Publish Date - 2020-10-29T17:33:16+05:30
టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో ఇళ్ళను లబ్దిదారులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ
గుంటూరు: టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో ఇళ్ళను లబ్దిదారులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించారు. వేయి మంది లబ్దిదారులతో నిరసన పాదయాత్ర చేపట్టారు. టిట్కో గృహాల నుంచి తెనాలి మున్సిపల్ కార్యాలయం వరకు పాదయాత్ర కొనసాగనుంది. ప్రభుత్వం తక్షణమే ఇళ్ళు కేటాయించకపోతే లబ్దిదారులతో గృహా ప్రవేశాలు చేస్తామని ఆలపాటి రాజా హెచ్చరించారు.
Updated Date - 2020-10-29T17:33:16+05:30 IST