బాణాసంచా కాల్చడంపై ఘర్షణ...వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2020-11-25T13:06:30+05:30
జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది.
గుంటూరు: జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. రాజుపాలెం మండలం గణపవరంలో ఇరు వర్షాలు ఘర్షణకు దిగాయి. బాణసంచా కాల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ వర్గం.. నాగభూషణం అనే వ్యక్తి ఇంటిపై రాళ్ల దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ నాగభూషణం, అతని కుమారుడిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా నాగభూషణం మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.
Updated Date - 2020-11-25T13:06:30+05:30 IST