పత్తి రైతులకు మద్దతు ధర
ABN, First Publish Date - 2020-10-27T07:55:57+05:30
పత్తి రైతులకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ఇప్పిస్తామని ఏపీ సీసీఐ జీఎం జీఎస్ సాయిఆదిత్య తెలిపారు.
వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
గుంటూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతులకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ఇప్పిస్తామని ఏపీ సీసీఐ జీఎం జీఎస్ సాయిఆదిత్య తెలిపారు. గుంటూరు అశోక్నగర్ ప్రధాన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం క్వింటా పత్తి కనీస మద్దతు ధర రూ.5,496 నుంచి రూ.5,825గా నిర్ణయించినట్లు చెప్పారు. రైతుభరోసా కేంద్రాల్లోనే వారంలో సీసీఐ కొనుగోళ్లు ప్రారంభిస్తామన్నారు. మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేశామన్నారు. కొనుగోలు పూర్తయిన వారం రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బు జమచేస్తామని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన ఆదిత్యను అధికారులు, బయ్యర్లు అభినందించారు. అనంతరం ఆదిత్య మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్నతో చుట్టుగుంట సెంటర్లోని కార్యాలయంలో భేటీ అయ్యారు.
Updated Date - 2020-10-27T07:55:57+05:30 IST