ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జై అమరావతి అనేందుకు ఎమ్మెల్యే నిరాకరణ

ABN, First Publish Date - 2020-10-03T11:21:51+05:30

భూములు ఇచ్చి రోడ్డున పడ్డామని రాజధాని మహిళా జేఏసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉద్దండ్రాయునిపాలెంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి శుక్రవారం వినతిపత్రం అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్లూరు, అక్టోబరు 2: భూములు ఇచ్చి రోడ్డున పడ్డామని రాజధాని మహిళా జేఏసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉద్దండ్రాయునిపాలెంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి శుక్రవారం వినతిపత్రం అందించారు. అసైన్డ్‌ రైతులకు, పట్టా భూ మితో సమాన ప్యాకేజీ ఇస్తామన్న హామీ నెరవేరలేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. అమ రావతిలో భూమిలేని నిరుపేదలకు  ప్రతి నెలా గత  ప్రభుత్వం  ఇస్తున్న రూ.2500ను వైసీపీ  అధికారం వచ్చిన వెంటనే ఐదు వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, దానిని అమలు చేయలేదని తెలిపారు.


ఎమ్మెల్యేను కలిసేందుకు దాదాపు రెండు గంటలు వేచి ఉన్నారు. చివరికి ఎమ్మెల్యే శ్రీదేవిని కలిసి వినతిపత్రం ఇచ్చి జై అమరావతి అనాలని కోరారు. అందుకు నిరాకరించిన ఎమ్మెల్యే కారు ఎక్కి వెళ్ళిపోయారు. రాజధాని రైతులు, మహిళలు జై అమరావతి అని నినాదాలు చేయగా, అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలు జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. ఎక్కడో బయట నుంచి వచ్చి జై జగన్‌ అని అంటారా..? అని మహిళా జేఏసీ సభ్యులు మండిపడ్డారు. కాగా వినతిపత్రంలోని సమస్యను అధిష్టానం దృష్టికి  తీసుకెళతామని ఎమ్మెల్యే .. జేఏసీ సభ్యులకు చెప్పారు. 

Updated Date - 2020-10-03T11:21:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising