ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిందితులకు కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే కాసు

ABN, First Publish Date - 2020-10-01T10:06:21+05:30

నారాయణపురంలో వడ్డెర కార్మికులపై జరిగిన కత్తిపోట్ల ఘటనలో ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అనుచరుడు బయ్యన్న ప్రధాన నిందితుడని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీడీపీ నేత యరపతినేని ఆరోపణ


గుంటూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నారాయణపురంలో వడ్డెర కార్మికులపై జరిగిన కత్తిపోట్ల ఘటనలో ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అనుచరుడు బయ్యన్న ప్రధాన నిందితుడని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. బుధవారం ఆయన ఆన్‌లైన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. దాడిఘటనలో నలుగురు కార్మికులు గాయపడటంతో పాటు నీలకంఠ చనిపోయాడని, ఈ ఘటనకు సంబంధించి 14మందిపై కేసు పెట్టినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీస్‌శాఖను ప్రశ్నించారు.


నిందితుడిని అరెస్టు చేయకుండా అడ్డుపడటం హేయమైన చర్య అని, ఎమ్మెల్యేకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దాడికి కారకులైన వారిని అరెస్టు చేయించాలని డిమాండ్‌చేశారు. అంబాపురంలో దళిత యువకుడు విక్రమ్‌ హత్యకేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేదని తెలిపారు. భటృపాలెంలో రాజానాయక్‌ హత్య జరిగి ఏడాదవుతున్నా ఒక్కరినికూడా అరెస్టు చేయకపోవడం దుర్మార్గమన్నారు.


నిందితులను అరెస్టు చేయకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలుచేస్తూ, పోలీసు శాఖను అడ్డుపెట్టుకొని తప్పుడు కేసులు బనాయిస్తున్న వైసీపీ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు.  


Updated Date - 2020-10-01T10:06:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising