ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు దూరదృష్టితోనే ఎత్తిపోతల నిర్మాణం - మాజీ మంత్రి దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-09-29T10:39:04+05:30

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితోనే కొండవీటి వాగు ఎత్తిపోతల పథక నిర్మాణం సాధ్యమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లి, సెప్టెంబరు 28: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితోనే కొండవీటి వాగు ఎత్తిపోతల పథక నిర్మాణం సాధ్యమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కొండవీటి ఎత్తిపోతలను ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణ సమయంలో భూసేకరణ విషయంలో అప్పటి ప్రతిపక్ష నేతలు ఎత్తిపోతల వల్ల ఉపయోగం లేదని, కోట్లు వృధా చేస్తున్నారని అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించారని తెలిపారు.


కొండవీటి వాగు ఎత్తిపోతలను సందర్శించడానికి వస్తే, మోటార్లు కట్టివేశారని, కారణం అడిగితే సరైన సమాధానం చెప్పలేదని స్థానిక అధికారులపై మాజీమంత్రి ఉమా అసహనం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి గంజి చిరంజీవి, తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కొమ్మారెడ్డి కిరణ్‌ మాజీ మంత్రి వెంట ఉన్నారు. కాగా కొండవీటి వాగులో వరదనీటి ఉధృతి పెరగడంతో రైతుల అభ్యర్థన మేరకు అధికారులు ఎత్తిపోతల పథకం ద్వారా వరదనీటిని సోమవారం కృష్ణానదిలోకి విడుదల చేశారు. 6 మోటర్ల ద్వారా సుమారు 5 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలారు.  

Updated Date - 2020-09-29T10:39:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising