తిరుప్పావైపై ఆధ్యాత్మిక ప్రవచనం ప్రారంభం
ABN, First Publish Date - 2020-12-17T05:55:19+05:30
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ధనుర్మాసాన్ని పురస్కరించుకొని బుధవారం తిరుప్పావైపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది.
గుంటూరు (సాంస్కృతికం), డిసెంబరు 16: స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ధనుర్మాసాన్ని పురస్కరించుకొని బుధవారం తిరుప్పావైపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుప్పావైపై ఆధ్యాత్మిక ప్రవచనం ప్రతిరోజూ సాయంత్రం 6.30 ప్రారంభమవుతుందని, జనవరి 13 వరకు కొనసాగుతుందన్నారు. ఆధ్యాత్మిక ప్రవచకురాలు డాక్టర్ కేవీ శ్రీరంగనాయకి ప్రవచనం చేస్తూ గోదాదేవి వైశిష్ట్యాన్ని, స్వామి వారి విశేషాలను, మొదటి పాశురంలోని విశేషాలను వివరించారు.
Updated Date - 2020-12-17T05:55:19+05:30 IST