ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2020-11-27T06:00:04+05:30

మండలంలోని అన్నవరప్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు ఎస్‌ఐ హజరత్తయ్య తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రొంపిచర్ల, నవంబరు 26: మండలంలోని అన్నవరప్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు ఎస్‌ఐ హజరత్తయ్య తెలిపారు. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన కొక్కంటి శ్రీనివాసులు(51), చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన తండ్లం సుబ్రహ్మణ్యం(53) మృతి చెందారు. వీరు హైదరాబాద్‌ నుంచి కారులో ఒంగోలు వైపు వెళ్తుండగా  గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అన్నవరప్పాడు ఓవర్‌ బ్రిడ్జి దిగిన తరువాత ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో ఓ శుభకార్యానికి వెళ్ళి వస్తూ స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్న శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందగా అన్నంకి వెంకటరమణ, హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్‌ మంగలి వెంకటరమణలకు గాయాలయ్యాయి. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయి ఉండటంతో లారీని ఢీకొట్టి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ వాహనం అక్కడ లేదు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని నరసరావుపేటలోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. అన్నంకి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు  ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాలను నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. 


Updated Date - 2020-11-27T06:00:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising