రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN, First Publish Date - 2020-12-04T06:08:04+05:30
మండల పరిధిలోని అనుపాలెం సమీపంలో గురువారం గుంటూరు-మాచర్ల రహదారిపై జరిగిన ప్రమాదంలో భానుసాయి(16) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
రాజుపాలెం, డిసెంబరు 3: మండల పరిధిలోని అనుపాలెం సమీపంలో గురువారం గుంటూరు-మాచర్ల రహదారిపై జరిగిన ప్రమాదంలో భానుసాయి(16) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనుపాలెం గ్రామానికి చెందిన వీర్ల హనుమంతరావు పెద్ద కుమారుడైన భానుసాయి పదో తరగతి పూర్తిచేసి సత్తెనపల్లిలోని సెల్ఫోన్ షాపులో రిపేరు వర్కు నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో భానుసాయి ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వెళ్తుండగా గ్రామ సరిహద్దులో సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ల వైపు వస్తున్న తెలంగాణకు చెందిన మహబూబ్నగర్ డిపో బస్సు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పిడుగురాళ్ల రూరల్ సీఐ ఆంజనేయులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి హనుమంతరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - 2020-12-04T06:08:04+05:30 IST