దళితుల్లో మనోధైర్యం నింపాలి
ABN, First Publish Date - 2020-09-19T09:48:58+05:30
బాపట్ల మండలం మరుప్రోలువారి పాలెం దళిత వాడను కలెక్టర్, ఎస్పీ సందర్శించి అక్కడి దళితులకు మనోధైర్యాన్ని నింపాలని కేవీపీఎస్, దళిత, గిరిజన
గుంటూరు, సెప్టెంబరు 18: బాపట్ల మండలం మరుప్రోలువారి పాలెం దళిత వాడను కలెక్టర్, ఎస్పీ సందర్శించి అక్కడి దళితులకు మనోధైర్యాన్ని నింపాలని కేవీపీఎస్, దళిత, గిరిజన, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గుంటూరులోని లాడ్జి సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి టి.కృష్ణమోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు పాశం రామారావు, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్జే విద్యాసాగర్ తదితరులు ప్రసంగించారు. దళిత యువకుడిపై 30 మంది దాడి చేస్తే కేవలం 14 మందిని మాత్రమే అరెస్టు చేశారని, మిగతావారికి కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బి.భగత్సింగ్, బి.సురేష్, పి.ప్రకాష్, బి.వీరాస్వామి, బత్తుల అనిల్, బి.విల్సన్, కిషోర్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-09-19T09:48:58+05:30 IST