ఆటో బోల్తా.. భర్త మృతి.. భార్యకు గాయాలు
ABN, First Publish Date - 2020-12-06T05:45:04+05:30
మండలంలోని వింజనంపాడు అడ్డరోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్రగాయాలయ్యాయి.
వట్టిచెరుకూరు, డిసెంబరు 5: మండలంలోని వింజనంపాడు అడ్డరోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. పెదనందిపాడు మండలం అనపర్రు గ్రామానికి చెందిన నల్లూరి శివరామయ్య(73), భార్య లక్ష్మి శనివారం ఉదయం గుంటూరులోని ప్రైవేటు హాస్పటల్ వెళ్లేందుకు బయలుదేరారు. వింజనంపాడు అడ్డరోడ్డు వద్దకు వచ్చేసరికి ఆటో అదుపు తప్పి బోల్తాపడటంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 108 అంబులెన్స్లో జీజీహెచ్కి తరలించగా శివరామయ్య మృతిచెందగా ఆయన భార్య తీవ్రగాయలతో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివకృష్ణారెడ్డి తెలిపారు.
Updated Date - 2020-12-06T05:45:04+05:30 IST