ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో రైతుల పోరాటం చారిత్రాత్మకం

ABN, First Publish Date - 2020-12-16T04:19:44+05:30

ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం చారిత్రాత్మకమని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ అన్నారు.

మంగళగిరి పాత బస్టాండ్‌ సెంటర్‌లో జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌

మంగళగిరి క్రైమ్‌, డిసెంబరు 15: ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం చారిత్రాత్మకమని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ అన్నారు.  రైతుల పోరాటానికి మద్దతుగా  మంగళగిరి పాత బస్టాండ్‌ సెంటర్‌ వద్ద సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో  మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చిన్ని తిరుపతయ్య, పి.శివప్రసాద్‌, వై.వెంకటేశ్వరరావు, యు.సత్యనారాయణ జె.జాన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో..


రైతుల పోరాటానికి సంఘీభావంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని గోపాలకృష్ణ ఽథియేటర్‌ సెంటర్‌లో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.  సీపీఎం నాయకులు జేవీ రాఘవులు, సీఐటీయూ నాయకులు రామచంద్రరావు,  ప్రజారోగ్య వేదిక జిల్లా నాయకులు  డాక్టర్‌ కేవీఎస్‌ సాయిప్రసాద్‌, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కార్యదర్శి  ఎం.బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 

 


Updated Date - 2020-12-16T04:19:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising