ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరిన భార్య.. గొంతుకోసుకున్న భర్త

ABN, First Publish Date - 2020-07-06T16:00:40+05:30

కరోనా పరీక్ష చేయించుకుని రావాలని భార్య కోరటంతో భర్త గొంతుకోసుకున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుగ్గిరాల(గుంటూరు): కరోనా పరీక్ష చేయించుకుని రావాలని భార్య కోరటంతో భర్త గొంతుకోసుకున్న సంఘటన మండల గ్రామం దుగ్గిరాలలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. చెన్నకేశవనగర్‌కు చెందిన జి. అనూషకు పదేళ్ల క్రితం గుంటూరుకు చెందిన జయంత్‌తో వివాహమైంది. కొంత కాలం మనస్పర్థలతో దూరంగా ఉన్న వీరు ఏడాదిగా దుగ్గిరాలలో కలిసి ఉంటున్నారు. కాగా జయంత్‌ ఇటీవల గుంటూరు వెళ్లి, ఆదివారం సాయంత్రం తిరిగి దుగ్గిరాల వచ్చాడు. పరిస్థితులు బాగోలేదు.. కరోనా పరీక్ష చేయించుకుని ఇంటికి రావాలని కుటుంబసభ్యులు జయంత్‌ను కోరారు. అప్పటికే మద్యం సేవించి ఉన్న జయంత్‌ భార్యతో గొడవపెట్టుకుని, ఇంట్లోకి రానివ్వకపోతే కత్తితో గొంతుకోసుకుంటానంటూ వీరంగంవేశాడు. కుటుంబసభ్యులు వారించటంతో గొంతు దగ్గర స్వల్ప గాయమైంది. అనంతరం అతను బైక్‌పై బయటకు వెళ్లిపోయాడు. భయాందోళనకు గురైన భార్య అనూష స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Updated Date - 2020-07-06T16:00:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising