కుక్కను తప్పించబోయి అదుపుతప్పిన బైక్.. చివరకు జరిగిందిదీ..!
ABN, First Publish Date - 2020-08-08T14:59:58+05:30
కుక్కను తప్పించబోయి ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
నరసరావుపేట రూరల్(గుంటూరు): కుక్కను తప్పించబోయి ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు - గుంటూరు రాష్ట్ర రహదారిపై నరసరావుపేట మండలం కాకాని వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అయ్యప్పరాజుపాలెం గ్రామానికి చెందిన కత్తి తిరుపతయ్య, కృష్ణయ్యలు చిలకలూరిపేట మండలం అమీన్సాహెబ్పాలెంలో చేతికి కట్టుకట్టించుకొనే నిమిత్తం ఉదయాన్నే వచ్చారు. తిరుగు ప్రయాణంలో కాకాని వద్ద రోడ్డుపై ఉన్న కుక్కను తప్పించబోయి ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో తిరుపతయ్య(47) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయ పడిన కత్తి కృష్ణయ్యను 108 వాహనంలో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రూరల్ ఎస్ఐ రోశయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Updated Date - 2020-08-08T14:59:58+05:30 IST