23 నుంచి మిర్చియార్డుకు సెలవులు
ABN, First Publish Date - 2020-10-22T10:30:38+05:30
23 నుంచి మిర్చియార్డుకు సెలవులు
గుంటూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించినట్లు యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం తెలిపారు. యార్డు కార్మికుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెప్పారు. సాధారణంగానే శని, ఆదివారాలు యార్డుకు సెలవు కాగా దసరా పండుగ సందర్భంగా శుక్రవారం కూడా సెలవు ప్రకటించామన్నారు. ఈ దృష్ట్యా శుక్ర, శని, ఆదివారాలల్లో ట్రేడింగ్ జరగదని చెప్పారు.
Updated Date - 2020-10-22T10:30:38+05:30 IST