ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతితోనే.. మా భవిత

ABN, First Publish Date - 2020-03-30T10:05:08+05:30

‘అమరావతితోనే మా భవిత.. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం దిగి రావాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

103వ రోజూ అమరావతి నిరసనలు  


గుంటూరు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ‘అమరావతితోనే మా భవిత.. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం దిగి రావాలి. లేకుంటే ఊపిరి ఉన్నంత కాలం మెడలో ఆకుపచ్చ కండవా, చేతిలో ఆకుపచ్చ జెండాతో పోరు సాగిస్తునే ఉంటాం..’ అని అమరావతి ప్రాంత రైతులు తేల్చి చెప్పారు. అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతులు చేస్తోన్న ఆందోళనలు ఆదివారం 103వ రోజుకు చేరాయి.


నమ్మి ఓటేసిన పాలకులు మోసం చేశారని, ఓట్ల కోసం మా ఇంటి ముందుకు వచ్చిన వారు నేడు తప్పించుకు తిరుగుతున్నారంటూ తుళ్లూరు, మందడం, అనంతవరం, రాయపూడి, వెంకటపాలెం, నేలపాడు, దొండపాడు తదితర ప్రాంతాల రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం ఎన్నుకున్న ఎమ్మెల్యే ఏమైందో అర్ధం కావటం లేదన్నారు. ఎవరు వచ్చినా రాకపోయినా తమ పోరు ఆగదన్నారు. రాత్రి 7.30 గంటలకు విద్యుత్‌ నిలిపి కొవ్వొత్తులతో ‘అమరావతి వెలుగు’ పేరిట రాజధాని మహిళలు నిరసన ప్రదర్శన చేశారు. నిరసనలో భాగంగా మహిళలు  పచ్చరంగు మాస్కులను తయారు చేసి వాటిని ఉద్యమకారులకు పంచారు.  

Updated Date - 2020-03-30T10:05:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising