గుంటూరులో టీడీపీ దళిత నేతల నిరసన దీక్ష
ABN, First Publish Date - 2020-06-05T19:04:00+05:30
గుంటూరులో టీడీపీ దళిత నేతల నిరసన దీక్ష
గుంటూరు: జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ దళిత నేతలు శుక్రవారం నిరసన దీక్ష చేపట్టారు. వైకాపా ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా దీక్షకు దిగారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మానుకొండ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో దీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ రామకృష్ణ, టీడీపీ ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్ర దీక్షలను ప్రారంభించారు.
Updated Date - 2020-06-05T19:04:00+05:30 IST