గుంటూరులో రెచ్చిపోయిన మరో యువకుడు
ABN, First Publish Date - 2020-07-08T22:16:03+05:30
ఇంజనీరింగ్ విద్యార్థిని వేధింపుల కేసు మరువక ముందే జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో శివానంద్ అనే యువకుడు యువతులను మోసం చేస్తున్న వైనం వెలుగు
గుంటూరు: ఇంజనీరింగ్ విద్యార్థిని వేధింపుల కేసు మరువక ముందే జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో శివానంద్ అనే యువకుడు యువతులను మోసం చేస్తున్న వైనం వెలుగు చూసింది. నిందితుడు శివానంద్ యువతుల నగ్న చిత్రాలు తీసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ బాధిత యువతులను శివానంద్ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఈ వ్యవహారంలో శివానంద్కు ఇద్దరు పోలీసులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. శివానంద్ వేధింపులు రోజు రోజుకు మితిమీరడంతో బాధిత యువతి నేరుగా జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. వెంటనే స్పందించిన ఎస్పీ శివానంద్పై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. నరసరావుపేట టూటౌన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శివానంద్తో పాటు అతనికి సహకరిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపైనా కేసు నమోదు చేశారు. శివానంద్ నూజెండ్ల మండలం జంగాలపాడు వాసిగా గుర్తించారు.
Updated Date - 2020-07-08T22:16:03+05:30 IST