గుంటూరులో యువకుడిపై వైసీపీ దాడి
ABN, First Publish Date - 2020-06-01T16:19:59+05:30
గుంటూరులో యువకుడిపై వైసీపీ దాడి
గుంటూరు: జిల్లాలోని పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రులో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మాలెంపాటి గోపి అనే యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. అడ్డువచ్చిన వృద్ధురాలిపైనా దాడికి తెగబడ్డారు. ఈ నాలుగేళ్ళు తాము చెప్పిందే వినాలని హెచ్చరించారు. బాధితుడు గోపి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. సెలవు కావడంతో స్వగ్రామం వచ్చిన గోపిపై పాత కక్ష్యలు మనుసులో పెట్టుకుని దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2020-06-01T16:19:59+05:30 IST