స్విమ్స్లో ప్లాస్మా థెరపీకి ప్రభుత్వం అనుమతి
ABN, First Publish Date - 2020-05-27T22:45:26+05:30
స్విమ్స్లో ప్లాస్మా థెరపీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. స్విమ్స్లో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయల వల్ల ఈ అవకాశం లభించినట్లు వైద్యులు చెబుతున్నారు.
తిరుపతి: స్విమ్స్లో ప్లాస్మా థెరపీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. స్విమ్స్లో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయల వల్ల ఈ అవకాశం లభించినట్లు వైద్యులు చెబుతున్నారు. 18 ఏళ్ల పైబడి, 65ఏళ్ల లోపువారికే ప్లాస్మా థెరపీ చేస్తామని స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ తెలిపారు. స్వల్ప లక్షణాలున్నవారికే ప్లాస్మా థెరపీ ఇవ్వాలని ఐసీఎంఆర్ సూచనలున్నాయని, బంధువుల అనుమతి తర్వాతే రోగికి ప్లాస్మా థెరపీ చేస్తామని వెంగమ్మ చెప్పారు.
ఇప్పటికే తెలంగాణలో కరోనా పాజిటివ్ రోగికి ప్లాస్మా థెరపీ ఇచ్చి గాంధీ వైద్యులు విజయం సాధించారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న నగరానికి చెందిన 44 ఏళ్ల వ్యక్తికి ప్లాస్మా థెరపీ చేశారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారు. కరోనాను జయించిన వారిలో ఈ వైరస్పై పోరాటం చేసే యాంటీబాడీలు ఉంటాయి. వీటిని కరోనా తీవ్రంగా ఉన్న రోగుల్లోకి ప్రవేశపెట్టి వైర్సను నియంత్రించడంలో గాంధీ వైద్యులు సఫలమయ్యారు.
Updated Date - 2020-05-27T22:45:26+05:30 IST