పుష్పక విమానంలో గోవర్దన కృష్ణుడు
ABN, First Publish Date - 2020-10-22T09:12:23+05:30
పుష్పక విమానంలో గోవర్దన కృష్ణుడు
హనుమ, గజవాహనాలపైనా శ్రీవారి దర్శనం
తిరుమల, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం పుష్పక వి మానంలో రుక్మిణీ సత్యభామ సమేత గోవర్దన గిరిదారుడైన కృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి దర్శనమిచ్చారు. 15 అడుగుల ఎత్తు, 14 అడుగుల వెడల్పు, 750 కేజీల బరువుతో కొబ్బరి ఆకులు, వివిధ రకాల పుష్పాలతో పుష్పక విమానాన్ని అలంకరించారు. ఉదయం 9 గంటలకు హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో శ్రీనివాసుడు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు బంగారు గజవాహనంపై గోవిందుడు కటాక్షించారు.
Updated Date - 2020-10-22T09:12:23+05:30 IST