ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త
ABN, First Publish Date - 2020-07-05T01:13:07+05:30
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త
అమరావతి: 6, 7 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ద్రవ్యవినిమయ బిల్లు 30వ తేదీ సాయంత్రానికి ఆమోదం పొందడంతో 1న గవర్నర్కు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలను పంపించింది. ద్రవ్యవినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఏపీ ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవాళ శనివారం కావడంతో సోమ, మంగళవారాల్లో జీతాలు, పెన్షన్లు పడే అవకాశం ఉంది. గెజిట్ నోటిఫికేషన్ వచ్చాకే బిల్లులు తయారు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
Updated Date - 2020-07-05T01:13:07+05:30 IST