ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గన్నవరం ఎయిర్‌పోర్టు అప్రమత్తం

ABN, First Publish Date - 2020-03-20T17:18:20+05:30

ఏపీలో కరోనా వైరస్ కలకలంరేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్నవరం (విజయవాడ): ఏపీలో కరోనా వైరస్ కలకలంరేపుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఎన్నికలు రద్దయ్యాయి. విద్యాసంస్థలు, వివిధ రంగానికి చెందిన సంస్థలు మూసివేశారు. గన్నవరం విమానాశ్రంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్ పోర్టు డైరక్టర్ మధుసూదన్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో 45 రోజుల నుంచి జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే ప్రయాణీకులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.


కాగా కరోనా ఎఫెక్ట్‌తో విజయవాడ విమానాశ్రయం వెలవెలబోయింది. వారం రోజులుగా సగటున 500కు పైగా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతున్నట్టు విమానాశ్రయ ఉన్నతాధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు నడిచే విమాన సర్వీసును ట్రూజెట్‌ ఎయిర్‌లైన్స్‌ ఏప్రిల్‌ 20 వరకు రద్దు చేసింది. ఇటీవలే ట్రూజెట్‌ సంస్థ హైదరాబాద్‌కు రూ.1,100 చార్జీ నిర్ణయించింది. అయినా ఆదరణ లేక తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయించింది. బెంగళూరుకు వెళ్లే విమాన సర్వీసును స్పైస్‌జెట్‌ సంస్థ రద్దు చేసింది. ఇండిగో, ఎయిరిండియా సంస్థలు సర్వీసుల కుదింపునకు సన్నాహాలు చేస్తున్నాయి.

Updated Date - 2020-03-20T17:18:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising