మహాత్ముని సాక్షిగా
ABN, First Publish Date - 2020-04-10T08:12:14+05:30
కరోనా మహమ్మారి వ్యాపించకుండా చేద్దాం...చేతులు కడుక్కోండి...మా్స్కలు ధరించండి...భౌతికదూరం పాటించండి...అంటూ పాలకులు, యంత్రాంగం, అనేక సంస్థలవారు ముమ్మర ప్రచారం...
కరోనా మహమ్మారి వ్యాపించకుండా చేద్దాం...చేతులు కడుక్కోండి...మాస్కులు ధరించండి...భౌతికదూరం పాటించండి...అంటూ పాలకులు, యంత్రాంగం, అనేక సంస్థలవారు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అలాగే ప్రజానీకం కూడా ఎవరికి తోచిన రీతిలో వారు తమవంతు కృషి చేస్తుండడం విశేషం. విజయనగరంలోని గుంటూరు వారి వీధిలో బృందావనం అపార్టుమెంట్ వద్ద గాంధీ విగ్రహానికి ఇదిగో ఇలా మాస్క్ కట్టి...ప్రజలను జాగ్రత్తలు పాటించాలని సూచించడం ఆకర్షణగా నిలిచింది.
- -విజయనగరం
Updated Date - 2020-04-10T08:12:14+05:30 IST