అగ్నిప్రమాదంలో ఏడు గేదెలు మృతి
ABN, First Publish Date - 2020-05-09T14:42:42+05:30
అగ్నిప్రమాదంలో ఏడు గేదెలు మృతి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం అర్జునుడి పాలెం శివారులో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు గేదెల పాకలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గేదెల పాక పూర్తిగా దగ్ధమైంది. మంటల్లో చిక్కుకుని ఏడు గేదెలు మృతి చెందాయి. మంటలను గుర్తించిన గ్రామస్థులు మంటల అదుపునకు యత్నిస్తున్నారు. ప్రమాదంలో గేదెలు మృతి చెందడంతో యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
Updated Date - 2020-05-09T14:42:42+05:30 IST