ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప.గో. జిల్లాలో బీజేపీ నేతల ఉపవాస దీక్ష

ABN, First Publish Date - 2020-05-26T20:43:27+05:30

తిరుమల శ్రీవారి భూములు కాపాడాలంటూ బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో.జిల్లా: తిరుమల శ్రీవారి భూములు కాపాడాలంటూ బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా  ఉపవాస దీక్షలు చేపట్టారు. అందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బీజేపీ నేతలు ఉపవాస దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం టీటీడీ ఆస్తులను వేలం వేయాలని చూస్తోందని, అయితే తమ ఆందోళన తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులను నిలుపుదల చేసిందన్నారు. తమకు కావాల్సింది నిలుపుదల కాదని, పూర్తిగా ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 


అలాగే సింహాచలంలో వందలాది ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని, ఆ భూములను వెనక్కి తీసుకుని, ఆక్రమణదారులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దాతలు ఇచ్చిన ఆస్తులు స్వామివారి కోసమే వినియోగించాలని దాతలు కోరుకుంటారన్నారు. దానికి వ్యతిరేకంగా ఆస్తులు అమ్మకానికి పెట్టడం సరికాదని బీజేపీ నేతలు అన్నారు. దేవాలయానికి చెందిన ఆస్తులను ప్రభుత్వం పరిరక్షించాల్సిందిపోయి అమ్మకానికి పెట్టడమేంటని ప్రశ్నించారు.

Updated Date - 2020-05-26T20:43:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising