మాపై దుష్ర్పచారం చేయడం సబబేనా?: అమరావతి రైతులు
ABN, First Publish Date - 2020-08-05T20:29:44+05:30
రాజధాని అమరావతి విషయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు..
అమరావతి: రాజధాని అమరావతి విషయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతూ సీడ్ యాక్సిస్ రోడ్డు కిరువైపులా నిలబడి హైకోర్టు న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేసిన తమను కుక్కలతో పోలుస్తూ వైసీపీ సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేయటంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని రైతుల ఫొటోలను వరుసగా నిలబడిన కుక్కలతో పోల్చి మిక్స్ చేసి వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తీవ్ర ఆవేదనలో ఉన్న తమపై ఇటువంటి దుష్ఫ్రచారం చేయటం సమంజసమేనా? అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఈ తరహా తప్పుగా ప్రచారం చేయటం ఏంటని నిలదీస్తూ.. మహిళా రైతులు నిరసన తెలిపారు.
Updated Date - 2020-08-05T20:29:44+05:30 IST