ఎంసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
ABN, First Publish Date - 2020-03-24T10:01:42+05:30
కరోనా నేపథ్యంలో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి బి.సుధీర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. పరీక్షల తేదీలు, హాల్ టికెట్ల డౌన్లోడింగ్లో ...
ఈసెట్, ఐసెట్లకు కూడా..
అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి బి.సుధీర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. పరీక్షల తేదీలు, హాల్ టికెట్ల డౌన్లోడింగ్లో మాత్రం ఎలాంటి మార్పులూ లేవని సోమవారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. ఎంసెట్ ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 5 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 10 వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 15 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 17 వరకు, రూ.10 వేల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 19 వరకు పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈసెట్కు ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 9 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 10 వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 16 వరకు పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఐసెట్కు ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 9 వరకు, రూ.2,000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 16 వరకు, రూ.5,000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 22 వరకు, రూ.10 వేల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 25 వరకు పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Updated Date - 2020-03-24T10:01:42+05:30 IST