ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7న ఈ-లోక్‌ అదాలత్‌

ABN, First Publish Date - 2020-10-24T08:55:01+05:30

రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌లో వున్న మోటారు వాహన ప్రమాద కేసులు, ఎన్‌ఐ యాక్ట్‌ కేసులు తదితరాల సత్వర పరిష్కారం కోసం నవంబరు 7న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టులో పెండింగ్‌లో వున్న మోటారు వాహన ప్రమాద కేసులు, ఎన్‌ఐ యాక్ట్‌ కేసులు తదితరాల సత్వర పరిష్కారం కోసం నవంబరు 7న ‘ఈ - లోక్‌ అదాలత్‌’ జరుగనుంది. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలో జరుగనున్న ఈ లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.


దీనిలో పాల్గొనదలచిన కక్షిదారులు, న్యాయవాదులు తమ కేసు వివరాలను హైకోర్టు మెయిల్‌ ఐడీకి పంపాల్సి వుంటుంది. ఈ లోక్‌ అదాలత్‌కు బీమా కంపెనీల ద్వారా ప్రతిపాదించిన కేసుల వివరాలు మూడు రోజుల ముందుగా హైకోర్టు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. న్యాయవాదులు, కక్షిదారులు 7న హైకోర్టు వెబ్‌సైట్‌లో ఇవ్వబడిన లింక్‌ ద్వారా హాజరై కేసులను పరిష్కరించుకోవచ్చు. కక్షిదారులు, న్యాయవాదులు వివరాలు పంపాల్సిన ఈ మెయిల్‌ ఐడీ:aphclsc@gmail.com



Updated Date - 2020-10-24T08:55:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising