జగనన్న తోడు ప్రోగ్రాం రగడపై అధిష్టానం సీరియస్
ABN, First Publish Date - 2020-11-27T01:38:15+05:30
జగనన్న తోడు కార్యక్రమంలో నేతల రగడపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది. నిన్నతూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ ఆఫీస్లో వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ
కాకినాడ: జగనన్న తోడు కార్యక్రమంలో నేతల రగడపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది. నిన్నతూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ ఆఫీస్లో వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మీడియాలో వచ్చిన కథనాలపై టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించి విచారణకు ఆదేశించారు. క్రమశిక్షణ సంఘం నాయకులుగా మొగలి బాబ్జిని నియామకం చేశారు. నివేదిక అనంతరం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన నాయకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Updated Date - 2020-11-27T01:38:15+05:30 IST